అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 9 గంటల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 73,387 మంది భక్తులు దర్శించుకోగా 33,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని వివరించారు.