తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని79,525 మంది భక్తులు దర్శించుకోగా 39,545 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించారు. రేపటి 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు.
అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక జరిగిన దోషాల నివారణకు ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామన్నారుఆగస్టు 9న అష్టదళ పాదపద్మారాధనతోపాటు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.