తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉండగా వీరికి 8 గంటలలో దర్శనం కలుగుతుందని టీటీడీ వివరించింది . నిన్న శ్రీవారిని 72,067 మంది భక్తులు దర్శించుకోగా 27,581 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.30 కోట్లు ఆదాయం వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు.