తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా 31,581 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.45 వచ్చిందన్నారు.