తిరుమల : తిరుమల(Tirumala) వేంకటేశ్వరస్వామని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో 17 కంపార్టుమెంట్లు (Compartments ) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,328 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,033 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకలతో శ్రీవారి హుండీకి రూ. 3.84 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.