తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala) కు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి (Sarvadarsan) 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 67,198 మంది భక్తులు దర్శించుకోగా 22,452 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చిందని వివరించారు.