తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న భక్తులు సైతం తిరుమల(Tirumala) కు వస్తున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్టుమెంట్లలో 3 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,683 మంది దర్శించుకోగా 21,177 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చిందని వెల్లడించారు.