అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికుల జేఏసి పీఆర్సీపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన నిర్మాణ కార్మికుల సంఘం కడప జిల్లా కన్వీనర్ రామమోహన్,కో-కన్వీనర్ పాటిల్ చంద్రారెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని,అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయుల ,కార్మికులు తలపెట్టిన సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు.