తిరుమల : జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలతో పాటు ఇతర వస్తువులను స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు.
దీంట్లో భాగంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పనుల పురోగతిని చైర్మన్ కు వివరించారు.ఆలయ నిర్మాణానికి పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు.