అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా ఈతేరు-చుండూరుపల్లి ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ (Constable) మృతి చెందాడు. విధుల్లో భాగంగా కానిస్టేబుల్ గోపిరెడ్డి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోపిరెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద గన్మెన్గా పనిచేస్తున్నాడు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.