న్యూఢిల్లీ: తనను చంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తంచేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు మంగళవారం తనకు చాలా మంది ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాక్షసులను అంతమొందించేపనిలో పడిన తన హత్య కోసం కడప బ్యాచ్ను దించాలనుకుంటున్నారని ఆరోపించారు.
ఈ విషయమై తాను ప్రధాని నరేంద్రమోదీకి, హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలంటూ సీబీఐ డైరెక్టర్కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.