అమరావతి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద,పొరుగు సేవ ఉద్యోగులు ఆందోళనల తేదీలను ఖరారు చేశారు. ఐక్య కార్యచరణ సమితిగా ఏర్పడ్డ ఉద్యోగ సంఘాలు ఆదివారం విజయవాడలో సమావేశమయ్యార. సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఉద్యమంలో పొరుగు, ఒప్పంద ఉద్యోగులు పాల్గొంటునే ప్రత్యక్ష కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు.
దీంట్లో భాగంగా ఈనెల 15 నుంచి 28వ తేదీ వరకు జిల్లా సదస్సు, మార్చి 1 నుంచి 6 వరకు పట్టాణాల్లో సమావేశాలు, మార్చి 15లోపు మండల సమావేశాలు, కమిటీల ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 20వ తేదీ లోగా మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు, ఈనెల 28 న సంబంధిత మంత్రులకు ఈ మెయిల్స్ పంపాలని నిర్ణయించారు.
మార్చిన 6న విజయవాడలో దీక్షలు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ చేపట్టనున్నారు. పొరుగు, ఒప్పంద ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని సంఘాల నేతలు కోరుతున్నారు.