అమరావతి : పల్నాడు జిల్లాలో బాంబుల స్వాధీనం కలకలం రేపుతుంది . ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో 17 నాటు బాంబులు (Bombs) , వేటకొడవళ్లు, రాడ్లు ఉండడాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు (Police) విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. సుమారు. 10 లక్షల విలువల తెలంగాణ మద్యాన్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు.