Justice Lisa Gill | ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. అలాగే మద్రాస్ హైకోర్టు సీజేపీ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని సిఫారసు చేసింది.
జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆమె నియామకానికి సంబంధించి కొలీజియం సిఫారసుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే.. ఏపీ హైకోర్టు సీజేగా ఆమె బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ చరిత్రలో నిలిచిపోనున్నారు.