అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు (New Districts) ఉనికిలోకి రానున్నాయి. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య ప్రారంభం సీఎం జగన్ నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పరిపాలన ప్రారంభం కానుంది. నిన్నటివరకు రాష్ట్రంలో 13 జిల్లా ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటుచేయడంతో వాటి సంఖ్య 26కు పెరిగింది. ఇప్పటివరకు ఉన్న 51 డివిజన్ల సంఖ్యను 73కి పెంచింది. కాగా, 42 ఏళ్ల తర్వాత ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటయ్యారు. చివరిసారిగా 1979లో విజయనగరం జిల్లాను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కొత్త జిల్లాలను సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వస్తుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సందేశమివ్వనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన విషయం తెలిసిందే. అదేవిధంగా 26 జిల్లాలకు 26 మంది జిల్లా రెవెన్యూ అధికారులను కూడా నియస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.