అమరావతి : విదేశి పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి (Chief Minister YS Jagan) శనివారం లండన్(London) కు చేరుకున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బయలు దేరిన జగన్ దంపతులు ఉదయం లండన్లోని లూటన్ ఎయిర్పోర్టు(Luton Airport) లో దిగారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు జగన్కు స్వాగతం పలికారు.
ఎయిర్పోర్టు వద్ద జగన్ అభిమానులు ఆయన కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తరువాత వైఎస్ జగన్ సీబీఐ కోర్టు అనుమతితో విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈనెల 31 వ తేదీ వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో జగన్కు మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిలు సెండాఫ్ ఇచ్చారు.