అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో జగన్ కాలికి స్వల్ప గాయమైంది. సాయంత్రానికి కూడా సీఎం కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
దీంతో సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. 26న విజ్ఞాన్భవన్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్ స్థానంలో ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత హాజరుకానున్నట్లు సమాచారం.