అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు చేరుకున్న జస్టిస్కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు . రాత్రి జరిగే గరుడ సేవలో సీజేఐ పాల్గొననున్నారు.
శనివారం ఉదయం మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా దర్శనమిచ్చారు. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజ స్వామివారిని దర్శించుకున్నారు.