తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సంఘాల్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.