Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల సీఐడీ కస్టడి ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు రెండురోజుల పాటు ప్రశ్నించారు. రెండురోజుల్లో దాదాపు చంద్రబాబును సీఐడీ అధికారులు 12 గంటల పాటు ప్రశ్నించారు. దాదాపు 120 ప్రశ్నలు వేశారు.
డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తున్నది. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై సైతం విచారించారని సమాచారం. మరో వైపు కస్టడీ ముగిసిన నేపథ్యంలో చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపరుచనున్నారు. అయితే, ఈ సమయంలో చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీ కావాలని సీఐడీ కోరే అవకాశాలున్నాయి. రిమాండ్, కస్టడీపై కొద్దిసేపట్లోనే స్పష్టత రానున్నది.