తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి రోజు సోమవారం శ్రీవారిని దర్శించుకుంటారని భావించినప్పటికీ శనివారం సాయంత్రమే స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. అమిత్ షా వెంట సీఎం జగన్ కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు.
ఆదివారం మధ్యాహ్నాం 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అమిత్ షా అధ్యక్షతన జరుగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి , అండమాన్ నికోబర్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెప్టినెంట్ గవర్నర్లు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రాధాన్యత గల సమావేశం సందర్భంగా సమావేశం స్థలంతో పాటు తిరుపతి, తిరుమలలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లను చేశారు.