అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు. 23న కడప, తిరుపతి, 24న నెల్లూరులో పర్యటిస్తారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు.
గత మూడు రోజుల క్రితం అసెంబ్లీలో వైసీపీ నాయకులు తన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా మనస్తాపానికి గురై కంట తడి పెట్టిన చంద్రబాబు అదే రోజు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు పయనమయ్యారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజానికానికి అండగా నిలిచేందుకు , వారిని ఓదార్చేందుకు తొలిసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.