అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా ముద్దనపల్లిలో గ్రానైట్ అక్రమ మైనింగ్పై ఎన్జీటీ ఆదేశాల లేఖను జత చేసి పంపించారు. ఎన్జీటీ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ను ఎన్జీటీ నిర్ధారించిందని వెల్లడించారు.
సీఎస్ సహా ఇతర అధికారులు అక్రమ మైనింగ్ను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని తెలిపారు. పటిష్ట చర్యలతో అక్రమ మైనింగ్ను అడ్డుకోవాలని సూచించారు.