అమరావతి: నెల్లూరు జిల్లాలో ఎస్సీ యువకుడి ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఎస్సీ యువకుడు కరుణాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువులో చేపలు పట్టకుండా వైసీపీ నాయ కులు అడ్డుకోవడం, వారి వేధింపులు తాళలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకు న్నాడని వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో బలహీనవర్గాలు బలైతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఎస్సీలకు రక్షణ ఏర్పడుతుందని అన్నారు.