అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆళ్లనాని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశంలో నిర్వహిస్తున్న ఆందోళనపై ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న మరణాలపై అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించానని తెలిపారు. నల్గురు చనిపోతే 18 మంది చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామంలో జరుగుతున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాతోనే జంగారెడ్డి గూడెంలో మరణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరంగా బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. నాటు సారా, కల్తీసారా తాగడం వల్లే చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.