అమరావతి : కాకినాడలో హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఇవాళ కాకినాడలోని సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి అతడి భార్యను ఓదార్చారు. బాధితుడికి అండగా ఉంటామని తెలిపారు. రూ. 5లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ అనంతబాబును ఇంకా అరెస్టు చేయకపోవడం విస్మయం కలిగిస్తుందని అన్నారు. నిందితుడు బయట తిరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హత్య ఘటనపై మృతుడి భార్య సీబీఐ విచారణ కోరుతున్నారని తెలిపారు. టీడీపీ , ఎస్సీ సంఘాల పోరాటంతోనే అనుమానాస్పద కేసును హత్య కేసుగా నమోదు చేశారని వెల్లడించారు.