Chandra Babu in Delhi | ఆర్టికల్ 356ను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరినట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం వైఎస్ జగన్తో కలిసి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిన డీజీపీని రీకాల్ చేసి, ఆయన చేసిన తప్పులకు శిక్షించాలని కోరామన్నారు. సోమవారం రాష్ట్రపతితో భేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం సాగుతుందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడి విషయమై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశామన్నారు. విచారణతో వాస్తవాలు వెలికి తీయాలని కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని, దోషులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళన కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా.. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయని ఆయా రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. మధ్యనిషేధం పేరిట భారీగా రేట్లు పెంచి, మాఫియాగా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పరోక్ష విమర్శలు గుప్పించారు.
టీడీపీ ‘డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’ కోసం పోరాడుతుందని చంద్రబాబు చెప్పారు. డ్రగ్స్తో యువత.. జాతి నిర్వీర్యం అవుతున్నదని. దీన్ని నియంత్రించాలని కోరినందుకే టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రపార్టీ ఆఫీసుపై దాడి చేయడం ఇది తొలిసారని, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే అని నొక్కి చెప్పారు.
రాష్ట్రంలో రెండేండ్లు ఉన్నాది పాలన సాగుతన్నదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మీడియాను నియంత్రిస్తున్నారని చెప్పారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తూ కస్టడీలో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నందుకే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
28 నుంచి ప్లిఫ్కార్ట్ బిగ్ దివాళి సేల్ : ఐఫోన్ 12, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు!
EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
Tax on Gratuity | గ్రాట్యుటీ మీద పన్ను ఉంటుందా?
Fuel Price Hike | 2020 మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలెలా పెరిగాయంటే!
పెట్రోల్, డీజిల్ ధరలపై ‘శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండి’.. కేంద్రానికి చిదంబరం చురకలు