అమరావతి: రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఏం చేశారని ఆయన వైఎస్సార్సీపీకి ఓటేయాలని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఎంగా జగన్కు ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం నెల్లూరు జిల్లా పొదలకూరులో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడే ధైర్యమే సీఎం జగన్కు లేదని విమర్శించారు.
‘ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా మద్యంలో కొత్త బ్రాండ్లు తెచ్చారు. మద్యపాన నిషేధం అంశంపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ నమ్మకద్రోహం చేశారు. నిత్యావసరాలు, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫైబర్ గ్రిడ్ ధర రూ.150 నుంచి రూ.400కు పెంచారు’ అని చంద్రబాబు మండి పడ్డారు.
‘నాకంటే బాగా చేస్తాడని భావించే రాష్ట్ర ప్రజలు జగన్కు ఓటేశారు. ఎవరు బాగా పరిపాలించారో ప్రజలు సావధానంగా ఆలోచించాలి’ అని అన్నారు.
‘రేపటి నుంచి ప్రతి విషయంలో పన్నులు వేస్తారు. మేం ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఇప్పుడు దానికి రెక్కలొచ్చాయి. ట్రాక్టర్ ఇసుకకు ప్రస్తుతం రూ.5వేలు తీసుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి కార్మికులు ఉపాధి కోల్పోయారు’ అని ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్తోనూ పర్సనల్ లోన్.. అయితే!