(Chandra Babu) అమరావతి: రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వీరి దౌర్జన్యాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలు గమనించాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించాలని సూచించారు. వైసీపీ పాలనను విధ్వంసంతో ప్రారంభించారని, ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేశారని అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజల ఆస్తుల ధ్వంసంతో వైసీపీ నేతల వైఖరి ఏమిటో తెలిసిపోయిందని చంద్రబాబు అన్నారు. దానికి కొనసాగింపుగా అమరావతి విధ్వంసం మొదలైందన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 50 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమవుతున్నప్పుడు ప్రజల్లో అవగాహన అవసరమని చెప్పారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందన్నారు. 2021లో పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..