అమరావతి : న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు ఊరట లభించింది. ఇవాళ తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐ అధికారులకు విన్నవించుకున్న మేరకు సీబీఐ అందుకు అంగీకారం తెలిపింది. ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం వేరే కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉన్న దృష్ట్యా తనకు వారం రోజులపాటు గడువు కావాలని ఆమంచి విజ్ఞప్తి చేశారు.
సమయమిస్తే వారం రోజుల్లో తిరిగి విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విచారణకు హాజరు కావాలని ఈ నెల 20వ తేదీన ఆమంచికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై గతంలోనూ విశాఖలో సీబీఐ ఎదుట మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు.