అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికల (Election) సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు (Cash), మద్యం (Liquor), బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ (Mukesh kumar meena) మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, డ్రగ్స్ పట్టుబడిందని వివరించారు. వీటికి సంబంధించి 4337 కేసులు, కోడ్ ఉల్లంఘటనకు సంబంధించి 247 కేసులు నమోదు చేశామన్నారు.
8,681 లైసెన్స్ కలిగిన ఆయుధాలను ఆయా పోలీస్స్టేషన్లో జమ చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, వినతులను ప్రతిరోజూ సాయంత్రం 4-5 గంటల మధ్య స్వీకరిస్తామని అన్నారు. రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.