అమరావతి : కాకినాడలో ఎమ్మెల్సీ అనంత భాస్కర్బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై కేసు నమోదు చేశామని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైద్య నివేదికలు వచ్చాక పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని ఆయన వెల్లడించారు. సాధ్య మైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామని ఆయన అన్నారు. విజయవాడ ఆస్పత్రిలో జరిగిన అత్యా చారం కేసులో పోలీసుల స్పందన సరిగా లేకపోవడంతో అక్కడి పోలీసులపై చర్యలు తీసుకున్నామని వివరించారు.
నారాయణ కేసులో సహకరించకపోవడం వల్లే ఏసీపీ సుజాతను సస్పెన్షన్ చేశామని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియా సంస్థలు సహకరిస్తే ఫేక్న్యూస్ నియంత్రణ సులభమవుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు పునరుద్ధరిస్తామని వివరించారు. ఏపీలో నిషేధిత వస్తువులు తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలు చేస్తే ఎలాంటివారినైనా వదలమని ఆయన స్పష్టం చేశారు .