Merugu Nagarjuna | వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మేరుగు నాగార్జున రూ.90 లక్షలు తీసుకున్నాడని విజయవాడకు చెందిన బాధితురాలు తాడేపల్లి పీఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్ను స్లో పాయిజన్ ద్వారా చంపేశానని.. నీదే గతి పడుతుందని మేరుగు నాగార్జున పీఏ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాలని రూ.90 లక్షలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.