అమరావతి : ఏపీ గుంటూరులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మంగళగిరి మండలం ఎర్రబాలెం చెరువులో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్థానికుల సహాయంతో పోలీసులు కారును చెరువులో నుంచి వెలికి తీశారు. కారులో నలుగురిని మృతదేహాలను గుర్తించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.