అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మైనుద్దీన్ జాఫర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే గరుడ బస్సులో సుమారు ఒక కిలో కు పైగా గంజాయి రవాణా చేస్తూ తనిఖీల్లో చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు. పట్టుబడిన గంజాయిని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించగా.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.