శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని(Hundi Income) బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు.
గత 49 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 5,62,30,472 ఆదాయంగా వచ్చినట్లు డీఈవో రవణమ్మ తెలిపారు. అదేవిధంగా 398.8 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 8 కేజీల వెండి ఆభరణాలు కానుకల రూపేణా భక్తులు సమర్పించారని చెప్పారు.
వీటితోపాటు యూఎస్ఏ డాలర్లు 1989, కెనడా డాలర్లు 305, ఆస్ట్రేలియా డాలర్లు 30, ఇంగ్లాండ్ పౌండ్స్ 25, సింగపూర్ డాలర్లు 56, కువైట్ దినార్స్ 10, యూఏఈ ధీర్హామ్స్ 30, ఈరోస్ 60, మలేషియా రింగేట్స్ 10, కథార్ రియాల్స్ 15 మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఏఈవో హారిదాసు తెలిపారు.