అమరావతి: సాధారణంగా ఆవులు,గేదెలు ఒక ఈతలో కేవలం ఒక దూడకే జన్మనిస్తాయి. అయితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కారు గ్రామంలో ని ఓ రైతుకు చెందిన బర్రె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం శ్రీకాకుళంలో ఓ రైతు ఇంట్లో ఆవు మూడు దూడలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలో బర్రె రెండు దూడలకు జన్మనివ్వడంతో జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
చుట్టుపక్కల గ్రామాలనుంచి తండోపతండాలుగా తరలివచ్చి ఈ దూడలను చూసి వెళ్తున్నారు. ఇదంతా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారంటూ గతంలో జరిగిన కొన్ని ఘటనలను గురించి జనాలు చర్చిస్తున్నారు.