హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఏపీకి నూతన నాయకత్వం అత్యవసరమని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ, వైసీపీ నాయకత్వంతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేయడం బీజేపీ, వైసీపీకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని ఏపీ ప్రజలు కాంక్షిస్తున్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కీలక పా త్ర పోషించనున్నదని ధీమా వ్యక్తం చేశారు.