తిరుమల : తిరుమలలో మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. భక్తుల రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని, రానున్న నాలుగైదు రోజుల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా బ్రేక్ దర్శనాలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నామని, ఆ భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.