అమరావతి : ఏపీలోని పరిశ్రమల్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ఘటనలు పరిశ్రమల్లో పనిచేసే కార్మిక, ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలోని ఓ ఫార్మా కంపెనీలో మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. మిథనాల్ ప్లాంట్లో భారీ పేలుడు సంబవించింది.
దీంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ముసలయ్య, రత్నబాబు, సత్యనారాయణ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు ఫార్మా కంపెనీకి చేరుకుని ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.