అమరావతి : ఏపీలో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న బీజేపీ (BJP ) బుధవారం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల (Assembly candidates ) పేర్లను ఖరారు చేసింది. జమ్మల మడుగు స్థానం నుంచి ఆది నారాయణరెడ్డి, ఆదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై. సత్యకుమార్, విజయవాడ వెస్ట్ నుంచి మాజీ మంత్రి సుజానాచౌదరి(Sujana Chaudhary) పేర్లను ప్రకటించింది.
విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు (Kamineni Srinivasa Rao) , బద్వేలు నుంచి బొజ్జా రోషన్న, అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు, ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావు, అరకు నుంచి పాంగి రాజారావు పేర్లను ప్రకటించింది. దీంతో కూటమితో చేసుకున్న ఒప్పందం మేరకు మొత్తం పది స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.