అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఇవాళ చేదు అనుభవం ఎదురయ్యింది . మంత్రి రాక సందర్భంగా క్యూలో నిలుచున్న భక్తులను గంటల తరబడి నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పూజలు చేసి వెళ్తుండగా మినిస్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మంత్రి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి భక్తుల వద్దకు వచ్చి సర్ధి చెప్పి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.