TTD | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ పదవిలో కరుణాకర్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. గతంలోనూ టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి సేవలందించారు. టీటీడీ చైర్మన్గా నియమించిన సీఎం జగన్కు భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.