తిరుమల:తిరుమలలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగియనుంది. అదేరోజున సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు. భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వహిస్తున్నారు. 16 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది.
జనవరి 13న సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నది. భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఆ తరువాత ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.