అమరావతి : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వద్ద ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టిం చింది. ఈ దాడిలో 8 మందికి తీవ్రగాయాలు కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. రెండురోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి నిన్న రైతుపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు అప్రమత్తతో ఉన్న ఇవాళ మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది.
భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి గాయాలు కాగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీప పలాస ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.