అమరావతి: ఏపీలోని కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం పెనసం గ్రామానికి సంతోష్, ఈశ్వరరావు వారం క్రితం స్వగ్రామం నుంచి విజయవాడకు పాదయాత్రగా బయలు దేరారు. తునివద్ద వీరిని కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.