అమరావతి : ఆంధ్రప్రదేశ్లో యువతులపై దారుణాల పరంపర కొనసాగుతూనే ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడి ఘటనను మరచిపోకముందే అనకాపల్లి జిల్లాలో ఓ ఉన్మాది యువతి గొంతుకోసం తీవ్రంగా గాయపరిచాడు. జిల్లాలోని వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది . నగేశ్ అనే యువకుడు బ్లేడ్తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గతంలోనూ నగేశ్ ఇదే యువతిపై దాడి చేసి గాయపరచడంతో బాధితురాలి కుటుంబంలో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.