అమరావతి : ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా నెలకొల్పిన కొత్త జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకంతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆయా ప్రభుత్వ శాఖలకు కమిషనర్లకు నియమించింది. దీంట్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కమిషనర్గా స్వప్నిల్ దినకర్, గుంటూర్ మున్సిపల్ కమిషనర్గా కీర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్గా చేతన్ను ప్రభుత్వం నియమించింది .
నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా జాహ్నవి , కర్నూలు మున్సిపల్ కమిషనర్గా భార్గవ తేజ , ఏపీ సీఆర్డీఏ కమిషనర్గా వివేక్ యాదవ్, పోలవరం పరిపాలన అధికారిగా ప్రవీణ్ ఆదిత్య, రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నిశాంతిని నియమించింది . ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అరుణ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది . గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా గంధం చంద్రుడు , వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్గా జె. నివాస్, రవాణాశాఖ కమిషనర్గా కాటమనేని భాస్కర్, ఎస్ఈసీ కార్యదర్శిగా చక్రవర్తిని, మత్స్యశాఖ కమిషనర్గా కన్నబాబు, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీగా రాజబాబు, మున్సిపల్ శాఖ కమిషనర్గా ప్రవీణ్కుమార్ను నియమించింది .
దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్లాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా వీరపాండ్యన్ అదనపు బాధ్యతలు , వీఎంఆర్డీఏ కమిషనర్గా విశాఖ కలెక్టర్ మల్లికార్జునకు అదనపు బాధ్యతలు అప్పగించింది.