Andhra Pradesh Local Body Election Results : కుప్పం నియోజకవర్గంలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగరాసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో 1989 నుంచి టీడీపీ మినహా మరో పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించలేదు. 30 సంవత్సరాల తర్వాత చరిత్రను తిరగరాస్తూ కుప్పం మండలం టీ సుడుమూరు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని విజయం సాధించింది. అశ్విని 1,073 ఓట్లతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరో వైపు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ పరాజయం పాలైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెయ్యికిపైగా ఓట్లతో విజయం సాధించారు. దీంతో అధికార పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.