అమరావతి : పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలను(Medical Services) నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ సేవల ద్వారా రావాల్సిన దాదాపు 15వందల కోట్ల రూపాయల బకాయి (Pending Bills) లున్నాయని వాటిని చెల్లించాలని ఆసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి ఇదివరకే నోటీసులు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తమ సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బుందులు ఎదుర్కొన్నారు.
బుధవారం రూ.500 కోట్లను చెల్లిస్తామని చెప్పి రూ. 203 కోట్లు విడుదల చేసినా ఇంతవరకు తమ అకౌంట్లలో జమ కాలేదని అసోసియేషన్ ప్రతినిధులు వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఆరోపించారు. గతేడాది ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉన్న వారికి మాత్రం వైద్య సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కూడా ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.